సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయం
- సీజేఐను మినహాయించి న్యాయమూర్తుల సంఖ్య 30 నుంచి 33కు పెంచాలని నిర్ణయం
- పార్లమెంటులో త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- 2009లో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు
దీని ప్రకారం, సీజేఐను మినహాయించి మిగిలిన న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచాలని నిర్ణయించింది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే కనుక సీజేఐతో సహా న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరనుంది. కాగా, సుప్రీంకోర్టులో 2009లో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచారు. అయినప్పటికీ పెండింగ్ కేసుల భారం తగ్గలేదు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను మరోమారు పెంచాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం.