మీపై అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు: రాహుల్ వ్యంగ్యం
- ఉన్నావో అత్యాచార బాధితురాలికి రోడ్డు ప్రమాదం
- ఆమె బంధువులు ఇద్దరు మృతి
- ఘాటుగా స్పందించిన రాహుల్ గాంధీ
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో కారులో ఆమెతోపాటు ఉన్న బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అది ప్రమాదం కాదని, ఈ ఘటన వెనక అత్యాచార నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెనగర్ హస్తం ఉందని బాధితురాలి తల్లి ఆరోపించింది. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేసి మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బేటీ పడావో.. బేటీ బచావో’ పథకాన్ని ప్రశ్నించారు. కాగా, అది రోడ్డు ప్రమాదమేనని, ఈ ఘటనపై అనుమానాలు అవసరం లేదని యూపీ పోలీసులు స్పష్టం చేశారు.