కడప, పెడన, విజయనగరం, పార్వతీపురంలో వైసీపీ అభ్యర్థుల విజయం

  • కొనసాగుతున్న వైసీపీ హవా
  • కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా విజయం
  • పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు కూడా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేశ్, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావులు విజయం సాధించారు. కాగా, కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్కేలు తమ సమీప ప్రత్యర్థులపై ముందంజలో ఉన్నారు. అయితే, హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణ లీడ్ లో వున్నారు. 
Go Back to Shorts
cuddapah
vijayanagaram
Srikakulam District

More Telugu News