అధికారుల నిర్వాకం.. తెలంగాణలో రెండు చోట్ల ఆగిపోయిన పోలింగ్!
- రంగారెడ్డి, యాదాద్రిలో పోలింగ్ కు బ్రేక్
- తారుమారు అయిన బ్యాలెట్ పత్రాలు
- నేడు ప్రారంభమైన తొలి విడత పరిషత్ పోలింగ్
మరోవైపు ఇదే కారణంతో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్ ఆగిపోయింది. జనగామకు చెందిన బ్యాలెట్ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలివిడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 2,097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.