శ్రీలంకలో మళ్లీ పేలిన బాంబులు.. వణికిపోయిన ప్రజలు!
- రాజధాని కొలంబోలోని మేజిస్ట్రేట్ కోర్టు వద్ద ఘటన
- కూంబింగ్ జరుపుతుండగా పేలుడు
- తప్పిన ప్రాణనష్టం.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు
ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలో ఈరోజు మరోసారి పేలుడు సంభవించింది. భద్రతాబలగాలు రాజధానిలోని అడుగడుగున జల్లెడ పడుతుండగా, పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద పేలుడు జరిగిందని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈ ఘటనలో అధికారులు, ప్రజలు ఎవరూ గాయపడలేదన్నారు. ప్రజలెవరూ భయపడవద్దని సూచించారు. శ్రీలంకలో ఉగ్రపేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకూ 60 మంది అనుమానితులను అరెస్ట్ చేశామన్నారు.