సీఈసీ బ్లడ్ శాంపిల్స్ కామెంట్కు చంద్రబాబు ఘాటు కౌంటర్
- గాయమైతే ఒక చోటి నుంచి రక్తం సేకరిస్తే సరిపోతుంది
- రక్తం మొత్తం పాడైతే రోజూ డయాలసిస్ చేయాల్సిందే
- మా పోరాటం ఇకపైనా కొనసాగుతుంది
అరోరా చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చెన్నైలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గాయమైతే ఒక చోటి నుంచి రక్తం సేకరిస్తే సరిపోతుందని, కానీ రక్తం మొత్తం చెడిపోయినప్పుడు రోజూ డయాలసిస్ చేయాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంల దుర్వినియోగం, పనితీరుతో ఈసీకి వ్యాధి ముదిరినట్టే ఉందని చంద్రబాబు విమర్శించారు. దేశం కోసం తాము చేస్తున్న పోరాటం మున్ముందూ కొనసాగుతుందన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.