సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించేందుకు దక్షిణకొరియా చేరుకున్న మోదీ
- సియోల్ లో మోదీకి ఘన స్వాగతం
- ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో కాసేపట్లో కీలక ప్రసంగం
- రేపు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో భేటీ
ఇండియా-దక్షిణకొరియా బిజినెస్ సింపోజియంలో కాసేపట్లో మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం ఇండియా-దక్షిణకొరియా స్టార్టప్ హబ్ ను లాంచ్ చేస్తారు. భారత్ లో దక్షిణకొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు, ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరిగేందుకు ఈ స్టార్టప్ హబ్ కీలక పాత్ర పోషించబోతోంది.
కింహే నగరంలో దక్షిణకొరియా అధ్యక్షుడితో మోదీ రేపు భేటీ కానున్నారు. ప్రాచీన కాలంలో అయోధ్యతో ఈ నగరానికి సంబంధాలు ఉండేవని ఒక నమ్మకం ఉంది. ఇద్దరు నేతల భేటీ సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకోనున్నాయి.