ఆగని ఆందోళనలు...ఇంకా అట్టుడుకుతున్న కేరళ!
- శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసన జ్వాలలు
- కొనసాగుతున్న హిందూ సంస్థల ఆందోళన
- ఇప్పటి వరకు 1800 మంది అరెస్టు
తస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి.మురళీధరన్ నివాసంపై ఆందోళనకారులు బాంబులు విసిరారు. ఆ సమయానికి ఎంపీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తెల్లవారు జామున కన్నూరులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. కోజికోడ్ జిల్లాలో సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు ఆందోళనలు ఏ మాత్రం సద్దుమణగలేదు. గురువారం నుంచి ప్రారంభమైన ఆందోళనలు తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటి వరకు పోలీసులు 1800 మందిని అరెస్టు చేశారు. కాగా, ఆందోళనల కారణంగా 6వ తేదీన రాష్ట్రంలోని పథనందిట్టకు రావాల్సి ఉన్న ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది.