నాపై భారీ కుట్ర జరుగుతోంది: నితిన గడ్కరీ
- పార్టీకి, తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు
- నాపై వేస్తున్న నిందలను ఖండిస్తున్నా
- దుష్ట పన్నాగాలను బయటపెడతా
ఎన్నికల్లో గెలుపొందితే తామే సాధించామని చెప్పుకోవడానికి నేతలు ముందుంటారని... ఓటమికి కూడా బాధ్యత తీసుకోవడం గురించి నేతలు ఆలోచించాలని నిన్న గడ్కరీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. మూడు రాష్ట్రాల్లో ఓటమి నేపథ్యంలో, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై పరోక్షంగా గడ్కరీ విమర్శలు గుప్పించారని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నేడు గడ్కరీ ఈ మేరకు స్పందించారు.