టీఆర్ఎస్ కు వచ్చేవి 30 సీట్లే: మహాకూటమి
- నాగోల్ లో ఓ కార్యక్రమానికి హాజరైన మహాకూటమి నేతలు
- కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్న ఉత్తమ్
- పొత్తుతోనే ముందుకు వెళతామన్న కోదండరామ్
ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ గ్రాఫ్ 60 సీట్ల నుంచి 30 సీట్లకు పడిపోయిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో సమాజహితం కొరవడిందని కోదండరామ్ విమర్శించారు. సీట్ల పంపకాలలో చిన్నపాటి విభేదాలు వచ్చినా, పొత్తుతోనే ముందుకు వెళతామని చెప్పారు. చాడ మాట్లాడుతూ, ఉద్యమంతో సంబంధం లేని వారికి కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు దక్కాయని విమర్శించారు.