ఉండవల్లి గుహలను సందర్శించిన పవన్ కల్యాణ్!

  • ఏపీలో పర్యాటక కేంద్రం ఉండవల్లి గుహలు
  • అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్న పవన్
  • గోడలపై శిల్పాలను ఆసక్తిగా చూసిన జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక కేంద్రం ఉండవల్లి గుహలను ఆయన సందర్శించారు. గుహ లోపల శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. ఇతర దేవతామూర్తుల విగ్రహాలను దర్శించారు. అక్కడి గోడలపై చెక్కిన శిల్పాలను, నేలపై గుర్తులను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించారు. ఉండవల్లి కొండకు వెలుపలి భాగంలోని తపోవనాన్ని పవన్ సందర్శించారు.
Go Back to Shorts
Undavalli
Pawan Kalyan

More Telugu News