నారా లోకేశ్ ట్వీట్కు బీజేపీ నేత జీవీఎల్ కౌంటర్!
- ఏ సాధారణ వ్యక్తయినా సర్కారుని ప్రశ్నించవచ్చు
- యూసీలను నిజాయతీతో సమర్పించాలి
- తప్పుడు లెక్కలతో కాదు
- ఏపీ సర్కారు అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేస్తాం
ప్రభుత్వాన్ని ఏ సాధారణ వ్యక్తయినా ప్రశ్నించవచ్చని జీవీఎల్ అన్నారు. వినియోగించుకున్న నిధులకు సంబంధించి యూసీలను నిజాయతీతో సమర్పించాలి కానీ, తప్పుడు లెక్కలతో కాదని చెప్పుకొచ్చారు. ఏపీ సర్కారు చేస్తోన్న దీక్షను నయ వంచన దీక్షతో పోల్చిన జీవీఎల్.. ఆ దీక్షలో ఏపీ సర్కారు చేస్తోన్న అసత్య ప్రచారాన్ని తాము బట్టబయలు చేస్తామని అన్నారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలా లోకేశ్ వారసత్వ రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు.