'జై లవ కుశ' తరువాత కెమెరా ముందుకు వచ్చిన నివేదా థామస్
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే
- గ్యాప్ తరువాత నివేద చేస్తోన్న మూవీ ఇదే
అలా ఆమె కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగులో తాజాగా ఆమె జాయిన్ అయింది. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా షాలినీ పాండే నటిస్తుండగా .. మరో హీరోయిన్ గా నివేదా థామస్ కనిపించనుంది. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'నా నువ్వే' వచ్చేనెల 14వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా గుహన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.