14వ ఆర్థిక సంఘం కింద ఏపీకి నిధుల మంజూరు!
- 14వ ఆర్థిక సంఘం కింద రూ. 369 కోట్లు
- ఉపాధి హామీ పథకం కింద రూ. 31.76 కోట్లు
- బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్రం ప్రకటన
14వ ఆర్థిక సంఘం కింద ఏపీకి రూ. 369 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో రూ. 31.76 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ నిధుల కేటాయింపులపై ఏపీ మంత్రులు కాని, అధికారులు కానీ ఇంత వరకు స్పందించలేదు.