టీడీపీ ఎంపీల ప్రశ్నలకు ప్రధాని సిగ్గుతో తలదించుకోవాలి: బోండా ఉమ
- ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ కేంద్రం మోసం చేస్తోంది
- 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను 2027 వరకు ఎలా పొడిగించింది?
- ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ ప్రకటించాల్సిందే: ఉమ డిమాండ్
ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, మంత్రి జవహర్ మాట్లాడుతూ, బీజేపీతో ఉన్న మిత్రబంధం కోసమే నాలుగేళ్లు ఓపిక పట్టామని అన్నారు. అధికారం కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవమే తమకు ముఖ్యమని, ఎంపీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. ఆంధ్రుల కోపానికి కాంగ్రెస్ పార్టీ బలైందని, తమ ప్రజల మనోభావాలను బీజేపీ దెబ్బతీస్తోందని మండిపడ్డ ఆయన, వైసీపీ అధినేత జగన్ పైనా విమర్శలు గుప్పించారు. జగన్ ఓ అజ్ఞానని, తమపై ఆయన చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.