శశికళ వదిన ఇళవరసి ఇంటిపైనా ఐటీ దాడులు!
- జయ టీవీ ఆఫీసులో కొన్ని పత్రాల్లో ఇళవరసి ప్రమేయంపై ఆధారాలు
- మొత్తం 80 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
- 'నమదు ఎంజీఆర్' పేపర్ ఆఫీసుపైనా ఐటీ దాడులు
జయ టీవీ యాజమాన్యం పన్ను ఎగవేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై సాక్ష్యాలను సేకరించిన తరువాత ఈ దాడులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. జయ టీవీతో పాటు 'నమదు ఎంజీఆర్' పత్రిక ఆఫీసుపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాగా, జయలలిత మరణం తరువాత జయ టీవీ నిర్వహణను శశికళ తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇళవరసి కూడా శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో అక్రమాస్తుల కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు.