మోదీ స్టేడియంలో సన్రైజర్స్ ఘోరపరాజయం... 86 పరుగులకే ఆలౌట్
- సన్రైజర్స్పై 82 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం
- 169 పరుగుల లక్ష్య ఛేదనలో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన హైదరాబాద్
- రాణించిన గుజరాత్ బౌలర్లు.. రబడా, హోల్డర్లకు మూడేసి వికెట్లు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సన్రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్.. గుజరాత్ బౌలర్ల ధాటికి 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.
ఛేదనలో సన్రైజర్స్ ఆది నుంచే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్గా వెనుదిరగడంతో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగలేదు. కగిసో రబడా (3/28), జాసన్ హోల్డర్ (3/20) నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్ (19) టాప్ స్కోరర్గా నిలిచాడు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 61), వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో 50) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆరంభంలో కెప్టెన్ గిల్ సహా కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా, వీరిద్దరి భాగస్వామ్యాలు గుజరాత్ను ఆదుకున్నాయి. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు.
మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ ఈ సీజన్లో మరో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది.
ఛేదనలో సన్రైజర్స్ ఆది నుంచే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్గా వెనుదిరగడంతో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగలేదు. కగిసో రబడా (3/28), జాసన్ హోల్డర్ (3/20) నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ పాట్ కమిన్స్ (19) టాప్ స్కోరర్గా నిలిచాడు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 61), వాషింగ్టన్ సుందర్ (33 బంతుల్లో 50) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆరంభంలో కెప్టెన్ గిల్ సహా కీలక వికెట్లు త్వరగా కోల్పోయినా, వీరిద్దరి భాగస్వామ్యాలు గుజరాత్ను ఆదుకున్నాయి. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు.
మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ ఈ సీజన్లో మరో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది.