Amazon: భారత్లో చిక్కుకున్న హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ బంపరాఫర్
- హెచ్-1బీ వీసా జాప్యంతో భారత్లోనే ఉండిపోయిన అమెజాన్ ఉద్యోగులు
- 2026 మార్చి 2 వరకు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతి
- కోడింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులు చేయకూడదని కఠిన ఆంక్షలు
- ఇండియాలోని అమెజాన్ ఆఫీసులకు వెళ్లడంపై కూడా నిషేధం
హెచ్-1బీ (H-1B) వీసా జాప్యం కారణంగా అమెరికాకు వెళ్లలేక భారత్లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు టెక్ దిగ్గజం అమెజాన్ భారీ ఊరటనిచ్చింది. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు 2026 మార్చి 2 వరకు భారత్ నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసుకునే వెసులుబాటు కల్పించింది. సాధారణంగా వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలనే నిబంధనను ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సడలించినట్లు బిజినెస్ ఇన్సైడర్ కథనం పేర్కొంది.
2025 డిసెంబర్ 13 నాటికి భారత్లో ఉండి, వీసా స్లాట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అయితే, ఈ వెసులుబాటుతో పాటు కంపెనీ కొన్ని వింత ఆంక్షలను కూడా విధించింది. ఇండియా నుంచి పనిచేసే ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి సాంకేతిక పనులు చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు భారత్లోని ఏ అమెజాన్ కార్యాలయానికి వెళ్లకూడదని, టీమ్ మేనేజ్మెంట్ లేదా ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి అధికారిక నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. కేవలం పరిమితమైన విధులను మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది.
చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది టెక్కీలకు తాత్కాలికంగా ఊరటనిచ్చింది.
మరోవైపు గూగుల్, యాపిల్ వంటి సంస్థలు కూడా వీసా సమస్యల దృష్ట్యా అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి.
2025 డిసెంబర్ 13 నాటికి భారత్లో ఉండి, వీసా స్లాట్స్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. అయితే, ఈ వెసులుబాటుతో పాటు కంపెనీ కొన్ని వింత ఆంక్షలను కూడా విధించింది. ఇండియా నుంచి పనిచేసే ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ వంటి సాంకేతిక పనులు చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు భారత్లోని ఏ అమెజాన్ కార్యాలయానికి వెళ్లకూడదని, టీమ్ మేనేజ్మెంట్ లేదా ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి అధికారిక నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. కేవలం పరిమితమైన విధులను మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది.
చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఈ నిబంధనలు విధించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది టెక్కీలకు తాత్కాలికంగా ఊరటనిచ్చింది.
మరోవైపు గూగుల్, యాపిల్ వంటి సంస్థలు కూడా వీసా సమస్యల దృష్ట్యా అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి.