India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. మళ్లీ ఆగిన మ్యాచ్

India Australia match interrupted by rain
   
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వరుణుడు అడ్డుతగులుతున్నాడు. 8.5 ఓవర్ల మధ్య ఒకసారి ఆటకు అంతరాయం కలిగించిన వర్షం.. 11.5 ఓవర్ల మధ్య మరోమారు ఆటను అడ్డుకుంది. వర్షం పెరగడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి భారత్ 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (6), అక్షర్ పటేల్ (7) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌ను భయపెట్టింది. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0), శుభమన్ గిల్ (10)ను వెంటవెంటనే పెవిలియన్ పంపి భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది.    


India vs Australia
India
Australia
Perth ODI
Rohit Sharma
Virat Kohli
Shubman Gill
Shreyas Iyer
Axar Patel
Cricket rain delay

More Telugu News