Chandrababu Naidu: థాంక్యూ మోదీ గారూ!... ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం చంద్రబాబు
- కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన
- రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- పలు రంగాల్లో మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యం
- ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కర్నూలు పర్యటనలో భాగంగా సుమారు రూ.13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కర్నూలు విమానాశ్రయంలో ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాదరంగా వీడ్కోలు పలికారు.
దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. వివిధ రంగాలలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టులను ప్రారంభించినట్టు వెల్లడించారు. పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ ఉత్పత్తులతో పాటు పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలను బలోపేతం చేసే దిశగా ఈ పనులు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయడం, పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, అన్ని ప్రాంతాల మధ్య సమతుల్య ఆర్థిక అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఎంతో సంతోషకరమైన రోజని అభివర్ణించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని తన పర్యటనను ముగించుకుని తిరిగి వెళుతున్న సందర్భంగా, ఓర్వకల్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ఇతర నాయకులు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. వివిధ రంగాలలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టులను ప్రారంభించినట్టు వెల్లడించారు. పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ ఉత్పత్తులతో పాటు పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలను బలోపేతం చేసే దిశగా ఈ పనులు రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయడం, పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేయడం, అన్ని ప్రాంతాల మధ్య సమతుల్య ఆర్థిక అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఎంతో సంతోషకరమైన రోజని అభివర్ణించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని తన పర్యటనను ముగించుకుని తిరిగి వెళుతున్న సందర్భంగా, ఓర్వకల్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ఇతర నాయకులు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.