శ్మశానంలో చోరీ... చితిలో నుంచి కపాలం ఎత్తుకెళ్లిన దొంగలు
––
ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలాగే ఉంచి దహనం చేశారు. మంగళవారం ఛాబాబాయి అస్థికల కోసం వెళ్లిన బంధువులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరగా పడి ఉండగా.. ఎముకలు, కపాలం మాయమయ్యాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం కోసం దుండగులు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లారని వారు ఆరోపించారు. శ్మశాన వాటికలో భద్రత కల్పించని మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు.