Saif Ali Khan: కీలక ఆస్తుల విషయంలో నటుడు సైఫ్ అలీఖాన్ కు ఎదురుదెబ్బ

Saif Ali Khan Setback in Key Property Case High Court Ruling
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు, పటౌడీ నవాబు సైఫ్ అలీ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భోపాల్‌లోని ఆయన పూర్వీకులకు చెందిన సుమారు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ ఆస్తులను 'శత్రు ఆస్తి'గా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గత 25 ఏళ్లుగా ఈ కేసుపై న్యాయపోరాటం జరుగుతుండగా, తాజా తీర్పుతో సైఫ్ కుటుంబం ఆశలు సన్నగిల్లినట్లయింది.

వివరాల్లోకి వెళితే, భోపాల్ చివరి నవాబు హమీద్ ఉల్లా ఖాన్ పెద్ద కుమార్తె, అసలు వారసురాలైన అబిదా సుల్తాన్ (సైఫ్ ముత్తవ్వ) దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరించారు. దీనితో, 1968 నాటి 'శత్రు ఆస్తుల చట్టం' ప్రకారం ఆమెకు చెందాల్సిన ఆస్తులను కేంద్రం 'శత్రు ఆస్తి'గా వర్గీకరించింది. శత్రు దేశాల పౌరసత్వం స్వీకరించిన వారి ఆస్తులు ఈ చట్టం కింద ప్రభుత్వపరం అవుతాయి.

అయితే, నవాబు రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ (సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ) భారతదేశంలోనే ఉండిపోయారని, కాబట్టి వారసత్వం ఆమెకే చెందుతుందని సైఫ్ కుటుంబం వాదిస్తోంది. ఈ వివాదంలో నూర్-ఉస్-సబా ప్యాలెస్, ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, అహ్మదాబాద్ ప్యాలెస్ వంటి అత్యంత విలువైన, చారిత్రక భవనాలు కూడా ఉన్నాయి. హైకోర్టు తాజా తీర్పుతో నవాబు వ్యక్తిగత ఆస్తులు కూడా రాచరిక వారసత్వంలో భాగమేనన్న వాదనకు బలం చేకూరినట్లయింది. ఈ తీర్పుతో సైఫ్ కుటుంబం యొక్క 25 ఏళ్ల న్యాయపోరాటానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.
Go Back to Shorts
Saif Ali Khan
Saif Ali Khan property dispute
Bhopal property case
Enemy Property Act 1968
Abida Sultan
Sajida Sultan
Pataudi Nawab
Madhya Pradesh High Court
Indian inheritance law

More Telugu News