కుమారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
- కుమారులతో కలిసి మంగళగిరి నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన తండ్రీకొడుకుల ఫొటో
- నేడు మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
- రూ.1290 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన
ఈ సందర్భంగా పవన్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అభిమానులు ‘తండ్రీ తనయులు’ అనే క్యాప్షన్తో ఈ ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబంతో కాసేపు గడిపిన వెంటనే పవన్ కల్యాణ్ తన అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.
ఈ పర్యటనలో జలజీవన్ మిషన్లో భాగంగా రూ.1,290 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్న తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.