Srinagar Explosions: శ్రీనగర్‌లో మరోసారి భారీ పేలుడు శబ్ధాలు: ఆర్మీ అధికారులు

Srinagar Rocked by Explosions Army Confirms
షార్ట్స్‌లో చూడండి
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రెండు పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని, దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.

శ్రీనగర్ విమానాశ్రయ పరిసరాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు, పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అంతకుముందు, అవంతిపురా సమీపంలో కూడా ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణిని పోలిన ఓ వస్తువు పడి ఉన్నట్లు గుర్తించామని వారు వివరించారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌ విమానాశ్రయం, ఎయిర్‌ బేస్‌ లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేయగా, భారత్ సైన్యం ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

ఈ వరుస పేలుళ్ల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా శ్రీనగర్‌తో పాటు ఉత్తర, పశ్చిమ భారత్‌లోని మొత్తం 32 విమానాశ్రయాలను ఈ నెల 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
Srinagar Explosions
Jammu and Kashmir
India
Army Officials
Airport Closure
Blast Sounds
Security Alert

More Telugu News