ఏపీ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల - వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ
- మే 9న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
- ఏప్రిల్ 29 నామినేషన్లకు చివరి తేదీ,
మే 2 ఉపసంహరణకు గడువు
విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల (ఏప్రిల్) 29వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దాఖలైన నామినేషన్లను ఏప్రిల్ 30వ తేదీన అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి మే 2వ తేదీ వరకు గడువు విధించారు.
అనంతరం, మే 9వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, అదే రోజు (మే 9) సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి, ఫలితాన్ని వెల్లడిస్తారు.