భారత జట్టు గెలిచాక ఎంహౌలో విధ్వంసం.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్లోని ఎంహౌలో విజయోత్సవ ర్యాలీ
- జామా మసీదు మీదుగా సాగుతుండగా రాళ్లు రువ్విన మూక
- అనంతరం విధ్వంసం.. వాహనాలు, దుకాణాలకు నిప్పు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందిని మోహరించాల్సిన అవసరం రాలేదు. కాగా, ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.