ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష

Gongadi Trisha meets CM Revanth Reddy
  • ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిష
  • త్రిషకు రూ.1 కోటి నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి
  • మరో ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున ప్రకటించిన ముఖ్యమంత్రి
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‍‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1 కోటి నజరానా ప్రకటించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులోని మరో సభ్యురాలు ధృతి కేసరి, జట్టు ప్రధాన కోచ్ నౌషీన్, శిక్షకురాలు షాలినిలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.

గొంగటి త్రిష ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను సత్కరించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం నుండి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
Advertisement
Revanth Reddy
Cricket
Trisha

More Telugu News