పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం
- మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఎగసిపడిన మంటలు
- భయాందోళనలకు గురయిన కార్మికులు, స్థానికులు
- మూడు గంటల పాటు శ్రమించి మంటలు అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
విషయంలోకి వెళితే.. ఈరోజు ఉదయం మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో, కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని ప్లాంట్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.