మహిళా అభిమానులు చుట్టుముడితే ధోనీ ఎలా డీల్ చేస్తాడో తెలుసా?
- అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ధోనీకి ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్
- ధోనీకి భారీగానే మహిళా అభిమానులు
- లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ఏం చేస్తాడనే ప్రశ్నకు ధోనీ ఆసక్తికర సమాధానం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా, ఎంఎస్డీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం అతడిని చుట్టేస్తుంటారు.
ఇక మహిళా అభిమానులు కూడా ధోనీకి అదే స్థాయిలో ఉన్నారు. అయితే, లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ధోనీ ఏం చేస్తాడు? ముఖ్యంగా భార్య సాక్షి సింగ్ తన పక్కనే ఉంటే, వాళ్లను ఎలా డీల్ చేస్తాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు మహీనే స్వయంగా సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన ధోనీకి "మీ చుట్టు లేడీ ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?" అని ఓ విలేకరి ధోనీని ప్రశ్నించారు. దీనికి ధోనీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
"తను (సాక్షి) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ ఆమె నా పక్కన లేకపోయినప్పటికీ, తను నాతోనే ఉన్నట్లు భావిస్తా. అదే మంచిది కూడా. నేను సేఫ్గా ఉండాలంటే అలా అనుకోవడమే బెటర్" అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ధోనీ, సాక్షి 2007 జులై 4న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు జీవా అనే కూతురు ఉంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఎంఎస్డీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అతని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐదుసార్లు టైటిల్ గెలిచింది.
గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఇక 2025 మెగా ఐపీఎల్ వేలంలో సీఎస్కే ధోనీని 'అన్క్యాప్డ్ ప్లేయర్' కింద కేవలం రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకుంది.
ఇక మహిళా అభిమానులు కూడా ధోనీకి అదే స్థాయిలో ఉన్నారు. అయితే, లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ధోనీ ఏం చేస్తాడు? ముఖ్యంగా భార్య సాక్షి సింగ్ తన పక్కనే ఉంటే, వాళ్లను ఎలా డీల్ చేస్తాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు మహీనే స్వయంగా సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన ధోనీకి "మీ చుట్టు లేడీ ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?" అని ఓ విలేకరి ధోనీని ప్రశ్నించారు. దీనికి ధోనీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
"తను (సాక్షి) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ ఆమె నా పక్కన లేకపోయినప్పటికీ, తను నాతోనే ఉన్నట్లు భావిస్తా. అదే మంచిది కూడా. నేను సేఫ్గా ఉండాలంటే అలా అనుకోవడమే బెటర్" అంటూ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ధోనీ, సాక్షి 2007 జులై 4న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు జీవా అనే కూతురు ఉంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఎంఎస్డీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అతని సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐదుసార్లు టైటిల్ గెలిచింది.
గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు. ఇక 2025 మెగా ఐపీఎల్ వేలంలో సీఎస్కే ధోనీని 'అన్క్యాప్డ్ ప్లేయర్' కింద కేవలం రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకుంది.
More Telugu News
ఇది క్రైస్తవులపై దాడి.. భారత చట్టంపై అమెరికా ఎంపీ సంచలన వ్యాఖ్యలు
![]()
యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో భారీ మార్పు.. ఎవరిపై ప్రభావం?
![]()
దుబాయ్లో భారత వ్యాపారవేత్త సతీశ్ సన్పాల్ ఆస్తులు ఫ్రీజ్!
![]()
భారత్లో జీవక్రియల సంక్షోభం.. ప్రాసెస్డ్ ఫుడ్తోనే పెను ముప్పు: ఏఐజీ వైద్య నిపుణులు
![]()
ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. సురక్షితంగా బయటపడ్డ 13 మంది సిబ్బంది
![]()
ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ ఇవ్వొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
![]()
అగాధం నుంచి అభివృద్ధి వైపు.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్
![]()
స్టేషన్ బెయిల్పై ఉదయనిధి విడుదల.. డీఎంకే కార్యకర్తల ఘనస్వాగతం
![]()
మద్యం కోసం ఆస్తులన్నీ అమ్మేశా.. 33 ఏళ్లకే జీవితం ముగిసిందనుకున్నా: వ్యాపారవేత్త నవీన్ అన్సల్
![]()
చిన్న ఇళ్ల కోసం బెస్ట్ ఐడియా.. ఈ 10 హ్యాంగింగ్ ప్లాంట్స్తో ఇంటికి కొత్త లుక్!
![]()
ఈజిప్టు మమ్మీల రహస్యం.. మనుషులనే కాదు, మొసళ్లను కూడా మమ్మీలుగా మార్చేశారు!
![]()
టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
![]()
రెండున్నరేళ్లలోనే ఆంధ్రప్రదేశ్కు రూ.19,619 కోట్లు: లోక్సభలో కేంద్రం వెల్లడి
![]()
స్క్రీన్ను ముట్టుకుంటే అరటిపండు.. టెక్నాలజీతో కోతుల తెలివికి పరీక్ష!
![]()
వేధించే వారి అకౌంట్లు ట్యాగ్ చేయండి.. నెటిజన్లకు మృణాల్ ఠాకూర్ పిలుపు
![]()