తన దాడిలో గాయపడిన టీవీ రిపోర్టర్ ను పరామర్శించిన మోహన్ బాబు
- ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం
- మోహన్ బాబు నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లు
- టీవీ9 రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి
- ఆసుపత్రిలో చేరిన రిపోర్టర్
- స్వయంగా కలిసి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.
ఆ రిపోర్టర్ కు క్షమాపణలు తెలియజేశారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులతోనూ మోహన్ బాబు మాట్లాడారు. ఆ రోజు తన నివాసంలో జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

