సీసీటీవీ ఫుటేజి మాయం... మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్
- మోహన్ బాబు కుటుంబ వివాదంలో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజి
- సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై పోలీసుల విచారణ
- ఘర్షణలో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు
ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను అరెస్ట్ చేశారు. విజయ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంకట్ కిరణ్ సీసీ టీవీ ఫుటేజి మాయం చేసినట్టు గుర్తించారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.