పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్
- ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
- ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న మాజీ మంత్రి
- పోరాటం తెలంగాణకు కొత్తకాదని.. ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉందన్న కేటీఆర్
- ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని వ్యాఖ్య
ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తుందని ఫైర్ అయ్యారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉందని పేర్కొన్నారు.
ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకై పోరాడుతామన్నారు. హైదరాబాద్లో 144 సెక్షన్ అమలులో ఉండగా, 13 జిల్లాల్లో అధికారికంగా, 20కిపైగా జిల్లాల్లో అనధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ యాక్ట్ను అమలు చేస్తోందని దుయ్యబట్టారు.