ఈ నెల 16వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ
- క్యాబినెట్ భేటీపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- 16వ తేదీ ఉదయం 11గంటలకు క్యాబినెట్ సమావేశం
- ఈ నెల 10న జరగాల్సిన క్యాబినెట్ అజెండా వాయిదా
రతన్ టాటా మృతితో ఈ నెల 10వ తేదీన జరిగిన మంత్రి మండలి భేటీలో అజెండా వాయిదా పడింది. దీంతో క్యాబినెట్ నిర్వహణ తేదీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మరోసారి ఖరారు చేశారు. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ - 4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతే కాకుండా ..స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలానే రాజధాని అమరావతి నిర్మాణాలు, పోలవరం ప్రాజెక్టుపైనా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
.