వంద సార్లు ఆయన పాదాలు తాకేందుకు కూడా సిద్ధమే: మహా సీఎం షిండే
- మహారాష్ట్రలో కూలిపోయిన ఛత్రపతి శివాజీ విగ్రహం
- గత ఏడాది విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
- విగ్రహ నిర్మాణంలోనే కుంభకోణం జరిగిందని విపక్షాల ఆరోపణలు
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్ కోట్ లో గత ఏడాది శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం ఎత్తు 35 అడుగులు. ఇటీవల ఈ విగ్రహం కూలిపోవడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు, విగ్రహాన్ని పునర్నిర్మించేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.