ఒమన్ లో కాల్పులు... మృతుల్లో భారత జాతీయుడు
- మస్కట్ నగరంలోని ఓ మసీదు వద్ద కాల్పులు
- ఐదుగురి మృతి
- మృతుల్లో నలుగురు పాకిస్థానీలు
- కాల్పులకు పాల్పడిన దుండగులను హతమార్చిన ఒమన్ భద్రతా బలగాలు
కాగా, మసీదు వద్ద కాల్పులకు తెగబడిన ముగ్గురు దుండగులను ఒమన్ భద్రతా బలగాలు హతమార్చాయి. దుండగుల కాల్పుల్లో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పాకిస్థానీలు కూడా మృతి చెందడం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఇది ఉగ్రదాడి అని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.