ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు పోలీసుల గౌరవ వందనం
- విజయవాడలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం
- జలవనరుల శాఖ అతిథిగృహంలో పవన్ కు అధికారుల స్వాగతం
- సచివాలయంలో తన పేషీని పరిశీలిస్తారని వెల్లడి
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్యాంపు కార్యాలయం భవనాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. బిల్డింగ్ పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం ఉండడంతో పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపై పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా జనసేన కార్యాలయం చేరుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయంకు వెళతారని, అక్కడ తన పేషీని పరిశీలిస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

