వరల్డ్కప్కు ముందు బంగ్లాదేశ్కు పసికూన యూఎస్ షాక్!
- హ్యూస్టన్ వేదికగా బంగ్లా, యూఎస్ మధ్య తొలి టీ20 మ్యాచ్
- 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన అమెరికా
- రాణించిన కోరె అండర్సన్ (34), హర్మీత్ సింగ్ (33)
- హృదోయ్ అర్ధ శతకం (58) వృథా
- బంగ్లాపై అమెరికాకు ఇదే తొలి విజయం
అంతకుముందు టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది అమెరికా. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదోయ్ అర్ధ శతకం (58) తో రాణించాడు. సౌమ్య సర్కార్ 20, మహ్మదుల్లా 31 రన్స్ చేశారు. యూఎస్ బౌలర్లలో స్టీవెన్ టేలర్ 2 వికెట్లు పడగొట్టగా.. సౌరభ్, అలీ ఖాన్, జెస్సీ సింగ్ చెరో వికెట్ తీశారు. అనంతరం 154 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అమెరికా అలవోకగా టార్గెట్ను అందుకుంది. 13 బంతుల్లో 33 పరుగులతో యూఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మీత్ సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.