అనుకూలించని వాతావరణం.. కేకేఆర్ ఆటగాళ్ల విమానం రెండుసార్లు మళ్లింపు.. అయినా చేరని గమ్యస్థానం

అనుకూలించని వాతావరణం.. కేకేఆర్ ఆటగాళ్ల విమానం రెండుసార్లు మళ్లింపు.. అయినా చేరని గమ్యస్థానం

 KKR chartered flight diverted to Guwahati and then Varanasi due to bad weather
  • గత రాత్రి లక్నో నుంచి కోల్‌కతా బయలుదేరిన కేకేఆర్ ఆటగాళ్లు
  • ప్రతికూల వాతావరణం కారణంగా తొలుత గువాహటికి మళ్లింపు
  • ఆ తర్వాత క్లియరెన్స్ లభించినా రెండోసారి అదే కారణంతో వారణాసికి
  • నేటి మధ్యాహ్నం కోల్‌కతాకు ఆటగాళ్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈ నెల 11న కోల్‌కతా నైట్‌రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం కేకేఆర్ ఆటగాళ్లు చార్టర్డ్ విమానంలో లక్నో నుంచి గతరాత్రి కోల్‌కతాకు బయలుదేరారు. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా విమానాన్ని రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. తొలుత గువాహటి, ఆ తర్వాత వారణాసికి విమానాన్ని మళ్లించారు. 

కోల్‌కతాలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని గువాహటికి మళ్లించారని, తాము ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యామంటూ కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత కాసేపటికే క్లియరెన్స్ లభించడంతో ఆటగాళ్లు తిరిగి కోల్‌కతా బయలుదేరారు. అయితే, ఆ తర్వాత తెల్లవారుజామున 1.20 గంటలకు మరోమారు ఎక్స్ చేస్తూ కోల్‌కతా వెళ్లాలన్న రెండో ప్రయత్నం కూడా ప్రతికూల వాతావరణం వల్ల విఫలమైందని, విమానాన్ని వారణాసి మళ్లించారని తెలిపింది.

చివరికి తెల్లవారుజామున 3 గంటలకు మరో అప్‌డేట్ ఇస్తూ.. ప్రస్తుతం తాము ఈ రాత్రి వారణాసి హోటల్‌లో ఉండబోతున్నట్టు తెలిపింది. మంగళవారం (నేడు) మధ్యాహ్నం కోల్‌కతా చేరుకుంటామని పేర్కొంది.
Advertisement
KKR
IPL 2024
Guwahati
Varanasi

More Telugu News