బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి దిగిన వరుణ్ తేజ్
- పవన్కు మద్దతుగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన వరుణ్ తేజ్
- అప్పులు చేసి మరీ రైతులకు పవన్ సాయం చేస్తున్నాడని ప్రస్తావన
- ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింత సేవ చేస్తాడని ఓటర్లను కోరిన వరుణ్ తేజ్
గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. దుర్గాడలో బహిరంగ సభలో మాట్లాడాడు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న వరుణ్ తేజ్కి రాజమండ్రి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తండ్రి నాగబాబు సహా పలువురు నేతలు ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానించారు. మరోవైపు రాజమండ్రి నుంచి పిఠాపురం చేరుకున్న వరుణ్కు అక్కడ కూడా భారీ స్వాగతం లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరోవైపు నాగబాబు, వరుణ్ ఇద్దరూ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.