లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ రూ. 82.90
  • 105 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 32 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి 72,748కి పెరిగింది. నిఫ్టీ 32 పాయింట్లు పుంజుకుని 22,055 వద్ద స్థిరపడింది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రు. 82.90 గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), జేఎస్ డబ్ల్యూ (2.98%), టాటా మోటార్స్ (2.75%), సన్ ఫార్మా (1.47%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.99%), టీసీఎస్ (-1.72%), టైటాన్ (-1.43%), విప్రో (-1.25%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.20%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News