డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ.. ఎలిమినేటర్లో తలపడేది ఎవరంటే..!
- ముగిసిన డబ్ల్యూపీఎల్ లీగ్ దశ మ్యాచులు
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్కు
- ఎలిమినేటర్లో తలపడనున్న ముంబై, బెంగళూరు
- గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీతో ఢీ
ఢిల్లీ ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ సంచలన బ్యాటింగ్తో అలరించింది. కేవలం 37 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 71 పరుగులు చేసింది. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే షఫాలీ వర్మ గుజరాత్ బౌలర్లపై ఎలా విరుచుకుపడిందో అర్థమవుతోంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ నేరుగా ఫైనల్కు చేరింది.
ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. శుక్రవారం ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, లీగ్ దశలో ముంబై, బెంగళూరు రెండు మ్యాచుల్లో తలపడగా చెరో విజయం నమోదు చేశాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య రేపటి ఎలిమినేటర్ పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 17న) జరగనుంది. ఇదిలాఉంటే.. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఒకవేళ ఈసారి ముంబై ఎలిమినేటర్లో ఓడితే మాత్రం కొత్త విజేతను చూడొచ్చు. ఢిల్లీ లేక బెంగళూరులో ఎవరో ఒకరు రెండో సీజన్ గెలిచే అవకాశం ఉంటుంది.