జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న ‘రామేశ్వరం కేఫ్’
- బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత పున: ప్రారంభమైన సర్వీసులు
- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కస్టమర్లు
- భారీ క్యూలైన్ ఏర్పడడంతో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని కేఫ్ వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు తెలిపారు. తమ భద్రతా బృందాన్ని పటిష్ఠం చేస్తున్నామని, సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ సైనికులతో కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా మార్చి 1న బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.