సీఎం జగన్ తన అసలు రంగు బయటపెట్టుకున్నారు: జానీ మాస్టర్
- ఇటీవలే జనసేనలో చేరిన జానీ మాస్టర్
- రూపాయికే ఇల్లు అని చెప్పిన జగన్ చివరకు శఠగోపం పెట్టారని విమర్శ
- అనిల్ కుమార్ యాదవ్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్య
రంగులు మార్చిన జగన్ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని చెప్పారు. ఇళ్లు ఇప్పించండని పేదలు మొరపెట్టుకుంటున్నా... నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనిల్ గ్రాఫ్ పడిపోవడంతోనే ఆయనను గుంటూరు జిల్లాకు జగన్ పంపించారని ఎద్దేవా చేశారు. టిడ్కో ఇళ్లు ఇచ్చేంత వరకు పోరాడుతానని చెప్పారు.