మేడారం జాతర: 'బంగారం' కొనాలంటే ఆధార్ చూపించాల్సిందే..!
- జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు
- కొనుగోలుదారుల ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్ తీసుకోవాలని వ్యాపారులకు ఆర్డర్
- గుడుంబా తయారీ కట్టడికేనని అధికారుల వివరణ
ఈ ఏడాది జాతర సందర్భంగా బెల్లం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు పెట్టడంతో అటు వ్యాపారులు, ఇటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆధార్ తప్పనిసరి నిబంధనను తొలగించాలని కోరుతున్నారు. అయితే, గుడుంబా తయారీని కట్టడి చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బెల్లం కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు.