నిన్నటి నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 122 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 34 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతానికి పైగా లాభపడ్డ నెస్లే ఇండియా షేరు విలువ
నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 71,437కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 21,453 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (4.66%), ఎన్టీపీసీ (2.16%), రిలయన్స్ (1.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.04%), ఐటీసీ (0.99%). 

టాప్ లూజర్స్:
విప్రో (-1.43%), టీసీఎస్ (-1.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.07%), టాటా స్టీల్ (-0.88%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.79%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News