హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా గ్రామ శివారులో ఘటన
- బస్సులో మంటలు గుర్తించి రోడ్డు పక్కన ఆపేసిన డ్రైవర్
- క్షణాల్లో బస్సును ఖాళీ చేసి ప్రాణాలు రక్షించుకున్న ప్రయాణికులు
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల లగేజీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.