30 ఏళ్లు మాత్రమే జీవించాలనుకున్నా.. 7 పేజీల లేఖ రాసి యువకుడి ఆత్మహత్య

 Indore hotelier shoots self dead and leaves 7 page note
తాను 30 సంవత్సరాలు మాత్రమే జీవించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, ఇప్పుడు ఆ వయసు రావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఏడు పేజీల లేఖ రాసి ఓ హోటల్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. అయితే, అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

హిరా నగర్ ప్రాంతంలోని అతడి ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వీయ రక్షణ కోసం 2016లో తీసుకున్న తుపాకితోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను జీవితాన్ని ముగిస్తున్నానని, దీనికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు. 

‘‘30 సంవత్సరాల వరకు మాత్రమే జీవించాలని 9 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. నాకు జీవితంలో ఎలాంటి బాధలు లేవు’’ అని అతడు ఆ నోట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. లేఖను బట్టి చూస్తే అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థమవుతోందని, అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
Go Back to Shorts
Madhya Pradesh
Indore Hotelier
Crime News

More Telugu News