పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థులను క్రేన్ ద్వారా వరద ప్రవాహాన్ని దాటించిన ఏపీ పోలీసులు.... వీడియో ఇదిగో!

AP Police sent students on a crane in knee deep flood water
  • నందిగామ వద్ద ఉద్ధృతంగా ప్రవహించిన మున్నేరు
  • ఐతవరం వద్ద రోడ్డుపైకి పొంగి ప్రవహించిన వాగు
  • పోలీసులను ఆశ్రయించిన పరీక్షకు వెళ్లాల్సిన  విద్యార్థులు
  • మానవతా దృక్పథంతో స్పందించిన పోలీసులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరు ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి ఉప్పొంగింది. దాంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

కాగా, ఈ పరిస్థితిలో ఓ సెమిస్టర్ పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థులు కొందరు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు వెళ్లే మార్గం లేక పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నందిగామ పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. 

అప్పటికప్పుడు ఓ క్రేన్ ను పిలిపించి, ఆ క్రేన్ పై విద్యార్థులను కూచోబెట్టి క్షేమంగా వరద ప్రవాహాన్ని దాటించారు. అంతేకాదు, పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చారు. పోలీసుల సహాయ చర్యను అందరూ అభినందించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం తమ పోలీసులను అభినందించారు.
Go Back to Shorts
AP Police
Students
Crane
Flood
Nandigama
Highway
NTR District

More Telugu News