Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పై అంతస్తు నుండి దూకేశారు

People jump from upper floors as fire engulfs Chhattisgarh
  • కోర్బా జిల్లా ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలో ఘటన
  • మొదటి అంతస్తు నుండి కిందకు దూకిన ప్రజలు
  • భారీ ఆస్తి నష్టం... ఎవరికీ హాని జరగలేదని వెల్లడి

ఛత్తీస్‌గఢ్ లోని కోర్భా జిల్లాలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలో ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. అంతలోనే భవనమంతా మంటలు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న వారు బయటకు పరుగు తీశారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకునేందుకు కొంతమంది మొదటి అంతస్తు నుండి కిందకు దూకారు. ఎగసిపడుతున్న మంటలను దాటి, మొదటి అంతస్తు నుండి కిందకు దూకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో బట్టల దుకాణం, ఇండియన్ బ్యాంకుతో పాటు పలు దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. ఈ మంటలు బ్యాంకులో మొదలయ్యాయి. క్షణాల్లో ఇతర దుకాణాలకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News