Tractor: గుంటూరు జిల్లాలో పంటకాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్... ఏడుగురి మృతి

  • శుభకార్యానికి వెళుతుండగా దుర్ఘటన
  • వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ ప్రమాదం
  • ఘటన స్థలిలోనే ముగ్గురి మృతి 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురి మృతి
  • ఆసుపత్రిలో ఒకరి మృతి
Seven died in a tractor mishap in Guntur district

గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు వద్ద ఓ ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలిలోనే ముగ్గురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడు నుంచి చేబ్రోలు మండలం జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కాగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోగా, కొందరు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.

More Telugu News